
* 14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరవుతున్నాయి
* ఈ విషయంలో మంత్రుల మధ్యే వార్ మొదలైంది
* 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలాడుతోంది
* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆకేరున్యూస్, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమీషన్లపై కాంగ్రెస్ లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చని అన్నారు.కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండిరగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా రేవంత్ రెడ్డి సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు.
…………………………………….