
* మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హరీష్రావు హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేదని.. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జిఎస్టి వృద్ధిరేటు పడిపోయిందన్నారు. దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు దేశ జిఎస్టి వృద్ధి రేటు కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నాం తప్ప తక్కువగా లేమని హరీశ్రావు గుర్తు చేశారు.
……………………………..