
* ఆయన కృషి ఫలితమే సీతారామా ప్రాజెక్టు
* తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్
* మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అబివృద్దే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్ అని, ఆయన గొప్పతనం కాంగ్రెస్కు ఇప్పటికైనా అర్థం కావాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harisharao) విమర్శించారు. కేసీఆర్ కృషి ఫలితమే.. సీతారామా ప్రాజెక్టు అన్నారు. నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను తీసుకొచ్చారని, రాడు సీతారామ ప్రాజెక్టు(Seetharama Project)ను కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. నేడు గోదావరి జలాల వద్ద కాంగ్రెస్ (Congress) మంత్రులు, నాయకులు ఫోటోలకు ఫోజులిస్తున్నారని తెలిపారు. తిట్టడం తప్ప.. కాంగ్రెస్ కు కట్టడం రాదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందన్నారు., కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి ఉందని, ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడం అని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని వివరించారు. కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారని, న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ_పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని వెల్లడించారు. ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందని తెలిపారు. ఖమ్మం(Khammam), భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట(Suryapet), మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గమన్నారు. కేసీఆర్ మొక్కనోని దీక్ష ముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయాయని వెల్లడించారు. బీఆరె్ఎస్ (BRS) ప్రభుత్వ కష్టం, నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడింది. 60 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పాలనకు, పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనకు తేడాను సుస్ఫష్టం చేసింది… అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పదిలక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే… దాని వెనుక బి ఆర్ ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. అని హరీశ్రావు చెప్పారు.
…………………………………..