
ఆకేరున్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో లా విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.. ఢల్లీికి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్టల్లో ఉంటూ లా మూడో ఏడాది చదువుతున్నాడు. సోమవారం రాత్రి వాష్ రూమ్కి వెళ్లిన షాగ్నిక్.. అందులోనే కింద పడిపోయి విగతజీవిగా ఉన్నాడు. గుర్తించిన విద్యార్థులు అతడిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షాగ్నిక్ గుండెపోటుతో మరణించినట్లు వర్సిటీ యాజమాన్యం వెల్లడిరచింది.
…………………………………