
* ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, తాడ్వాయి: ద్విచక్రహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాదాలను అరికడదాం అంటూ స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ యువతకు చైతన్యవంతం చేస్తూ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాలకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ పై వెళ్తున్న ద్విచక్ర వాహన దారులకు ఎస్సై పూల బోకేలు బహుకరించి శాలువాలతో ఘనంగా సన్మానించారు .వీరిని ప్పూర్తిగా తీసుకొని యువత అవగా హన కలిగి ఉండాలని యువతకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట సివిల్ ,సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులున్నారు.
……………………………………………………