* బట్టల షాపులో చెలరేగిన మంటలు
* పెద్దమొత్తంలో ఆస్తి నష్టం
* రెండు గంటలకు పైగా శ్రమించి..
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్ప్రైజెస్, ఫొటోగ్రఫి షాపు, కెనాన్ ఫొటోగ్రఫి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా కపిల దుకాణం యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
……………………………………….
