* రూ. 50 లక్షల విలువైన బంగారం..
* భారీగా నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని కార్ఖాన పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్రావ్ ఎన్క్లేవ్లో కెప్టెన్ గిరి ఇంట్లో నేపాల్ ముఠా ఈ చోరీకి పాల్పడింది. ఇంట్లో పని చేసే నేపాల్కు చెంది వ్యక్తి మరో నలుగురితో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. యజమానిపై దాడి చేసి.. ఆ తరువాత తాళ్లతో కట్టేసి రూ. 50 లక్షల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, రూ. 23 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
