
* ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సీపీ సన్ ప్రీత్సింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించిననందుకు.. అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో మిల్స్ కాలనీ ఇన్స్స్పెక్టర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు.
………………………………….