ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని జగ్గన్న పేట గ్రామం లో సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, లతో కలసి సిఎస్ఆర్ నిధులతో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ది కేంద్రాన్ని, ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించి, కోటక్ మహేంద్ర బ్యాంకు సహకారం తో 175 మందికి ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రం, ఉచిత కుట్టుమిషనులు, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కురేందుల శంకర్ తో పాటు మరో 8 మందికి 9 యూనిట్లు పాడి గేదెలను (ఒక లక్ష నలుబై వేల రూపాయల సబ్సిడీ తో), ఇందిరమ్మ చీరలను పంపిణీ పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలోని మహిళలు పొదుపు సంఘాల్లో చేరాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, ఏ పి ఎం శ్రీనివాస్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కోటక్ మహేంద్ర ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………
