* మొదటి పూజలు సమర్పించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: మేడారంలో ఆదివాసి సంస్కృతి ఆచార సంప్రదాయాలతో బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తితో గోవిందరాజుల, పగిడిద్దరాజు ,సమ్మక్క, సారలమ్మ ,పూజారులు పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలపై స్తంభాలు పునః ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటూరు నాగారం మండలం కొండయి నుంచి దెబ్బగట్ల వంశస్థులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు ఆయా వంశస్తుల ఆచార సంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మ పూజలతో కలిసి ఉమ్మడిగా పూజలు నిర్వహించి ఆయా గద్దె ల పై పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి ఆడబిడ్డలు మామిడి తోరణాలతో అలంకరించి డోలు వాయిద్యాల నడుమ మంగళహారతులు తో స్వాగతం పలికి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గద్దెలపై రహస్య పూజలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క, ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకాన్, మేడారం జాతర కార్యనిర్వాహణాధికారి వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజలు చేశారు. ఆయా దేవతల పూజారులు కుటుంబ సభ్యులు మొదటి మొక్కలను సమర్పించి ఆశీర్వాదం పొందారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఒకే వరుస క్రమంలో దేవతల గద్దెలు ఉండాలని ప్రభుత్వం పూజారుల ఆలోచన విధానాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇందులో భాగంగా మొదటి ఘట్టం పూర్తయింది దీంతో భక్తులు సునాయాసంగా సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు పగిడిద్ద రాజుల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదం పొందే విధంగా అభివృద్ధి పరిచారు. మొదటి మొక్కులు ను సీతక్క సమర్పించి ఆశీర్వాదం పొందారు.

………………………………………………………………

