
* సింగరేణి జాగృతి ఆవిర్భావం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అయ్యారు. సింగరేణి ప్రాంతానికి చెందిన జాగృతి నేతలు ఈ రోజు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి భారీగా తరలివచ్చారు. వారితో సమావేశమై కవిత పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం అని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని విమర్శించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత సమావేశం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
……………………………………….