
* పుల్లూరి కరుణాకర్ మాదిగ పిలుపు
* జులై 7న 31వ వార్షికోత్సవం
ఆకేరు న్యూస్ ములుగు : వచ్చేనెల ఏడవ తారీఖున ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్ మాదిగ పిలుపునిచ్చారు .మంగళవారం ములుగు జిల్లాలోని వాజేడు మండలం జగన్నాధపురం లో ఎమ్మార్పీస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించిన తరువాతనే మాదిగలకు గౌరవం లభించిందన్నారు. మంద కృష్ణ తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు. అనంతరం గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా ఇల్లందుల శ్రీకాంత్ మాదిగ ఎన్నికకాగా ఉపాధ్యక్షులుగా సోమిడి వెంకటేష్ మాదిగ ఎన్నికయ్యారు. ఇల్లందుల రాము మాదిగ ప్రధాన కార్యదర్శిగా, ఇల్లందుల ప్రశాంత్ మాదిగ కార్యదర్శిగా,ఇల్లందుల నర్సింహారావు మాదిగ ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యరు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లెందుల ఫకీరు గుగ్గిల దేవయ్య ఇల్లందుల చిరంజీవి ఇల్లెందుల శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………..