
* మెజిస్ట్రేట్కు ఓ భర్త ఫిర్యాదు
* సోషల్మీడియాలో వైరల్
ఆకేరు న్యూస్, డెస్క్ : “సార్.. నా భార్య రాత్రుళ్లు పాములా మారుతోంది.. నన్ను కాటేస్తోంది. తప్పించుకోవడానికి నేను నిద్రపోవడం లేదు. ఏదో రోజు చంపేస్తోంది..” అంటూ ఓ భర్త జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై వింత ఫిర్యాదు చేశాడు. సమాధాన్ దివస్లో భాగంగా జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఆ ఫిర్యాదు వివరాలు బయటకు వచ్చాయి. జిల్లా మెజిస్ట్రేట్ ముందు లోద్సా గ్రామానికి చెందిన మీరజ్ అనే వ్యక్తి తన ఫిర్యాదులో భార్య నాగినిగా మారి వేధిస్తున్నదన్నాడు. అనేక సార్లు తన భార్య తనను చంపేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ ప్రతి సారి ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు నిద్రలేస్తున్నట్లు చెప్పాడు. భార్య మానసికంగా వేధిస్తున్నదని, నిద్రిస్తున్న సమయంలో ఏదో ఒక రాత్రి తనను చంపేస్తుందని తన ఫిర్యాదులో తెలిపాడు. జిల్లా మెజిస్ట్రేట్ ఆ ఫిర్యాదుపై స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. దీనిపై దృష్టి పెట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కు ఆదేశాలు ఇచ్చారు. మీరజ్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ గా మారింది.
……………………………………………………….