* ఏళ్ల తరబడి దోచుకున్న ఆర్జేడీ
* రెండో దశ ఎన్నికల ప్రచారంలో మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : బిహార్లో ఎన్డీయే కూటమి గెలవబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిహార్ ప్రజలను ఆర్జేడీ ఏళ్ల తరబడి దోచుకుందని విమర్శించారు. బిహార్ అభివృద్ధి ఎన్డీయే తోనే సాధ్యమని స్పష్టం చేశారు. బిహార్ రెండో దశ పోలింగ్లో భాగంగా అరారియాలో జరిగిన ర్యాలీలో మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి(Congress-Rjc Alliance) కి దేశ భద్రత గురించి మాత్రమే కాకుండా దాని విశ్వాసం గురించి కూడా ఎటువంటి ఆందోళన లేదని ఆయన అన్నారు. మన సంస్కృతి, విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పేరు చెప్పకుండానే, కాంగ్రెస్ నాయకులు బీహార్కు వచ్చి ఛఠీ మైయా పూజను డ్రామా అని పిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఛఠీ మైయాను అవమానించడం కాదా? ఇది మన విశ్వాసాన్ని అవమానించడమే అన్నారు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు, ఆర్జేడీ ఎందుకు మౌనంగా ఉంటుంది. కుంభమేళా సమయంలో స్నానం చేయడాన్ని ఇదే కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ఎగతాళి చేసేవారని ప్రధాని మోదీ విమర్శించారు. ఇండి కూటమికి రాముడిపై నమ్మకం లేదని, విశ్వాసం లేదని, రామ్లాల ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు రాముడిని ద్వేషిస్తారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. “ఈరోజు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. బీహార్ అంతటా సోషల్ మీడియాలో అద్భుతమైన చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. బీహార్ యువతలో అపూర్వమైన ఉత్సాహం ఉంది. ఇంకా ఓటు వేయని వారు, ఇళ్లను వదిలి బయటకు రాని వారు వీలైనంత త్వరగా ఓటు వేయాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను. బీహార్ అంతటా ఒకే గొంతు ప్రతిధ్వనిస్తుంది.. అదే ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ” అని ప్రధాని మోదీ (Prime Minister Modi) స్పష్టం చేశారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
