
* అమెరికాలో బీఆర్ ఎస్ నేతలు కౌన్సిలింగ్ ఇచ్చారు
* పాత్రధారులు కాదు సూత్రధారులను కూడా విచారించాలి
* ప్రభాకర్ రావుపై విరుచుకుపడ్డ బండి సంజయ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః మాజీ ఇంటలిజెంట్ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదని ,ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండి పడ్డారు.
పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యాడన్నారు.అమెరికాలో ఉండగానే కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రభాకర్ రావుకు సిట్ విచారణలో చెప్పాల్సిన అంశాల గురించి తర్ఫీదు. ఇచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ బీజేపీ లతో పాటు ఎంతో మంది ప్రముఖుల, సినీతారల ఫోన్లను ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ అన్నారు ప్రభాకర్ రావు చేసిన నిర్వాకం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయినాయని బండి అన్నారు. ప్రభాకర్ రావు ఎవరిఆదేశాల మేరకు ఇదంతా చేశాడో బహిర్గతం కావాలని అన్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారులను కూడా విచారణకు రప్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చి సిట్ విచారణకు హాజరైన నేపధ్యంలో బండి సంజయ్ ఇలా స్పందించారు. ప్రభాకర్ రావును విచారించి తగినంత శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
………………………………………………..