
ఆకేరున్యూస్: ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు భారతీయ ఎంపీలు వివరిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని మన ఎంపీలు వివిధ దేశాలకు తెలియజేస్తుండగా.. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కొలంబియా దేశం పాకిస్థాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. ఆ దేశం వెళ్లిన శశిథరూర్ నేతృత్వంలోని బృందం దీనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలంబియా వైఖరి పట్ల ఇండియా తన విముఖతను వ్యక్తం చేయడంతో ఆ దేశం దిగివచ్చింది. దక్షిణ అమెరికా దేశం తన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంది. పాకిస్థాన్లో మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపిన కొలంబియా వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఇండియా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వెల్లడిరచగా.. పాక్ అనుకూల స్టేట్మెంట్ను కొలంబియా వెనక్కి తీసుకుంటుందని, ఆ తర్వాత భారత్కు మద్దతుగా స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు.
………………………………………….