
* రూ.12,000 కోట్ల విలువైన ఎండీ డ్రగ్ పట్టివేత
*ఫ్యాక్టరీ యజమానితో సహా 12మంది అరెస్ట్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. ఈ నేపధ్యంలో మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో నడుస్తున్న రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా, ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్ను ఉత్పత్తి చేస్తున్న ఈ ముఠా నుంచి సుమారు రూ. 12,000 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీకి ‘వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ పేరుతో లైసెన్స్ ఉన్నప్పటికీ, లోపల పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల తయారీ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ లో తయారు చేసిన డ్రగ్స్ ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇదంతా పెద్ద నెట్ వర్క్ ద్వారా నడిపిస్తున్నారు.ఈ నేపధ్యంలో పోలీసులు తమ సిబ్బందిని కార్మాగారంలో పనివాళ్లుగా ప్రవేశపెట్టారు. వారి ద్వారా దందా మొత్తం వెలుగులోకి వచ్చింది.వారాల తరబడి ప్రమాదకర ఆపరేషన్ చేసిన అనంతరం, ముఠా మూలాలను గుర్తించి ఫ్యాక్టరీపై దాడి చేశారు. దాడిలో అత్యాధునిక రసాయన పరికరాలు, డ్రగ్ ఉత్పత్తి యూనిట్లు, 32,000 లీటర్లకు పైగా ప్రికర్సర్ కెమికల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసి ఓ విదేశీయుడి సహా 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీ, రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేశారు. నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని, శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాఠే ఉన్నారు.
………………………………….