*శీతకాల విడిదిలో భాగంగా పర్యటన ఖరార్
* బొల్లారంలో రెండు రోజులు బస
* నగరంలో కట్టుదిట్టమైన భద్రత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్కు వస్తున్నారు. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. 21న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో 1:10 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30గంటలకు నేరుగా రాజ్భవన్కు వెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 3:25 గంటల వరకు రాజ్భవన్లో విశ్రాంతి తీసుకొని 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు. రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టదిట్టమైన భద్రత చేపట్టారు. శీతకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్లో రెండు రోజులు బస చేయడం ఆనవాయితీ.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
