* పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని
* ప్రధానికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
ఆకేరు న్యూస్, డెస్క్ : నవంబర్ 23న సత్యసాయి బాబా జయంతి. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్ లు ఘనంగా స్వాగతం పలికారు. సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న అనంతరం మోదీ పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లోపాల్గొంటారు. ఇందులో భాగంగా రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , నారా లోకేష్ , ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ , ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ , ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ఉత్సవాల్లో పాల్గొంటారు. వివిఐపీల రాక నేపథ్యంలో పుట్టపర్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1995లో శ్రీసత్యసాయి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా నవంబరు 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో 30వ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఈ వేడుకల కోసం హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు.దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ క్యాక్రమానికి హాజరుకానున్నారు.
………………………………………………….
