
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో పాదయాత్ర చేపట్టి చేపట్టి ప్రజల సమస్యలు తెలుకోవడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇయ్యడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నాని తెలిపారు. శనివారం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు 31వ డివిజన్ 49వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు.అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేను సత్కరించారు.
31వ డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజిలకు శంకుస్థాపన..
హన్మకొండ 31వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు ఆధ్వర్యంలో వాసవి కాలని, దుర్గాదేవి కాలని, ప్రశాంత్ కాలనీలో 1 కోటి 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, డ్రైనేజ్లకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు.
49వ డివిజన్లో..
హన్మకొండ సుబేదారి లోని విడో కాలనిలో 49వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏనుగుల మనసా రాం ప్రసాద్ 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని అన్నారు. డివిజన్ లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ నిర్మాణం చేపడుతామని అన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను నిర్నీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపలలో సాగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు వెళ్తుందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు, డివిజన్ అద్యక్షుడు అన్కేశ్వరపు సురేందర్ పాల్గొన్నారు.
………………………………