
– బాధ్యులను శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డికి మనవి
– హత్య చేసి నీటి సంపులో పడవేశారని మహిళా సంఘాల ఆరోపణ
– లేకపోతే ఆందోళన చేస్తాం మహిళా సంఘాల డిమాండ్
ఆకేరు న్యూస్,కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన వివాహిత దార్ల రేణుశ్రీ ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆదివారం మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. రేణు శ్రీ అనే వివాహిత అనుమానస్పద మృతి పట్ల గూడూరులో మహిళా సంఘాలు గూడూరు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ…. రేణు శ్రీ పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్న పిల్లలు పుట్టడం లేదని అత్త,మామ,భర్త మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారన్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను మేనరికం పెళ్లి చేశారని అయినా కర్కశంగా హత్య చేసి నీటి సంపులో పడవేశారని ఆరోపించారు.భర్త దార్న ఉదయ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి పిల్లలు పుట్టడం లేదని అనడం సిగ్గుచేటు అన్నారు. రేణు శ్రీ చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా మృతికి కారకులైన వారిని అరెస్టు చేయలేదని, తక్షణమే అరెస్టు చేసి, చట్ట పరంగా శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పోలీసు డిపార్ట్మెంట్ కి మనవి చేశారు. లేనిచో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని అన్నారు.కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకురాలు కుక్కల శోభారాణి, కోమల, కళ్యాణి, చంద్రకళ ,మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….