* స్లాబ్ పెచ్చులూడి ముగ్గురు కార్మికులు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. భవనానికి మరమ్మతులు చేస్తుండగా శ్లాబ్ పెచ్చులూడీ కార్మికులపై పడింది. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో.. వాటిని తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈఎస్ఐ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు.
…………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
