
ఆకేరున్యూస్,కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురైన విద్యార్థిని శైలజ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు. వీరిలో ఇద్దరు కోలుకోగా శైలజ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె చివరకు మృతిచెందారు. శైలజ మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
…………………………………..