
* రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా?
* రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని, రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే అని పేర్కొన్నారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీష్రావు పేర్కొన్నారు. రూ. 6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు, ఇంకెన్ని రోజులు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగుల్లో, ప్రచార సభల్లో, 16వ ఆర్థిక సంఘం ముందు, చివరికి ప్రజాపాలన దినోత్సవం వేదికగా కూడా అదే వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏముందని నిలదీశారు. 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన విషయం నిజం కాదా అన్నారు.
* రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా?
రాష్ట్రం దివాళా తీసిందన్న మీ మాటలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా? భావితరాలకు శిక్ష వేస్తారా అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే తెలంగాణ, మీ పాలనలో టాప్ పది స్థానంలో కూడా స్థానం దక్కించుకోలేక పోయిందన్నారు.
……………………………..