* శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఖతార్ నుంచి వచ్చిన విమానంలో అధికారులు ఈ గంజాయిని గుర్తించారు. శుక్రవారం ఉదయం ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. వారి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయి దొరికింది. దీని విలువ రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయిని ఇండియా తరలించడం పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న వారిపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ) అధికారులు నిఘా పెంచారు. అయినప్పటికీ గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో కిలో హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

