
ఎమ్మెల్సీ కవిత
* ఎమ్మెల్పీ కల్వకుంట్ల కవిత
* కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. నో కామెంట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణిలో పొలిటికల్ అవినీతి ఎక్కువ అయిందని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై హెచ్ ఎం ఎస్ ( HMS) తో కలసి అలయన్స్గా పనిచేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని అన్నారు. ఈసారి దసరా బోనస్ను 37శాతం సింగరేణి కార్మికులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్తో గ్యాప్పై మాట్లాడటానికి . కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. బీఆర్ఎస్ పార్టీపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా..బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.
………………………………………