
* తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసును ఏసీబీకి బదిలీ చేయాలని సిట్ దరఖాస్తు
ఆకేరున్యూస్, తిరుమల: తిరుమల శ్రీ వారి భక్తులు పవిత్రంగా భావించే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై సిట్ దృష్టి సారించింది. ఇక, కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ బృందం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసులో స్థానిక 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా..సిట్ అధికారులు ఈ కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ ్గªల్ చేశారు. అయితే, నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతోంది. తిరుమల ల్యాబ్లోనే నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావించింది. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు తెలిసింది. అయితే, కల్తీ నెయ్యి కేసు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది..
……………………………..