
* ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నాం
* పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
*సిద్దిపేట జిల్లాకు 12వేల ఇందిరమ్మ ఇళ్లు
* మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
ఆకేరు న్యూస్ సిద్దిపేటః సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. సిద్దిపేట లోని కొండా భూదేవి గార్డన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రబుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన
హామీలన్నీ నెరవేరు్చతోంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 23 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 10 వేల కోట్ల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ ఇటీవల విడుదల చేశారని మంత్రి అన్నారురూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని చెప్పారు. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇస్తోందని వెల్లడించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.అంతకుముందు గజ్వేల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమావతి పాల్గొన్నారు. గజ్వేల్లో 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. గృహజ్యోతి కింద 79 వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి.పేదలకు రేషన్కార్డ్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. 600 గజాల స్థలంలో ప్రతి నిరుపేద ఇండ్లు కట్టుకునేందుకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 600 గజాల కంటే ఎక్కువ ఇంటి నిర్మాణం ఉండేలా లబ్ధిదారులు చూసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
……………………………………………..