
* 84శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం
* మిగతా 16శాతం పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేకపోతేంది
* వరంగల్లో ఏడాదిగా నిలిచిపోయిన హెల్త్సిటీ నిర్మాణ పనులను సందర్శించి మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్లో హెల్త్సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఏర్పాటు చేశాడని.. హెల్త్సిటీ తెలంగాణకే తలమానికం అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఏడాదిగా నిలిచిపోయిన హెల్త్సిటీ నిర్మాణ పనులను హరీశ్రావు సందర్శించి మాట్లాడారు. హెల్త్సిటీని ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర్, నేను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామన్నారు. కానీ, మిగతా 16శాతం పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందన్నారు.
హెల్త్సిటీని పూర్తిచేస్తే, కేసీఆర్కు పేరు వస్తదని… ఏవో సాకులు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పనులు ఆపుతున్నాడన్నారు. 24 అంతస్తుల్లో ఏర్పాటుచేసే హెల్త్సిటీలో మొదటి 14 ఫ్లోర్లలో మాత్రమే ఈ హాస్పిటల్ ఉంటుందని.. మిగతా 10 ఫ్లోర్లలో ల్యాబ్, లైబ్రరీ, బ్లడ్ బ్యాంకు, డాక్టర్స్, స్టుడెంట్స్ అకామిడేషన్, తదితర సౌకర్యాలుంటాయన్నారు. జైపూర్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలాంటి పెద్ద ఆస్పత్రినే కట్టారని.. వాళ్లు కడితే ఒప్పు, మేం కడితే తప్పు ఎలా అవుతుందన్నారు. అలాగే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారిందని.. ఎంజీఎం సమస్యలపై గురించి పత్రికల్లో ప్రతిరోజూ వార్తలే వస్తున్నాయన్నారు.
ఇచ్చిన హామీలన్నీ బంద్..
రైతుబంధు, బతుకమ్మ చీరెలు, మత్స్యకారులకు చేపపిల్లలు, దళితబంధు, బీసీ బంధు ఇలా అన్నీ పథకాలను సీఎం బంద్ చేశాడన్నారు. రేవంత్రెడ్డి కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ, తొక్కుకుంటూ ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చిన అంటున్నాడని.. ఈ తొక్కుడు ఎప్పటికీ నడవదు అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా వరంగల్ హెల్త్సిటీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
…………………………………………