
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డట్లు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో జరగాల్సిన ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా పడినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడిరచింది. ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈనెల 10న ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ నెల 12న ఇరుదేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరపున్నట్లు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు ఇవాళ ఉదయం 12 గంటలకు హాట్లైన్లో చర్చలు జరపాలని ముందుగా నిర్ణయించారు. అయితే, చివరి నిమిషంలో ఈ చర్చలు వాయిదా పడినట్లు సమాచారం. ఇక ఈ చర్చల్లో భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొననున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
………………………………………