
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డుల విధివిధానాలపై, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీపై, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
……………………………………….