
* ఆతిథ్యరంగానికి పెరుగుతున్న ఆదరణ
ఆకేరున్యూస్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిరదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమై తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. పీపీపీ విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, హెరిటేజ్, మెడికల్, వెల్ నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా నూతన పర్యాటక విధానాన్ని రూపొందించామని వివరించారు. రాష్ట్రంలో 2030 నాటికి రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల సవిూకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్టాల్ల్రో ఒకటిగా నిలపాలనే ఆశయంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
………………………………………..