
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ ((TET) పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్(Exams) జరగనున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు వేర్వేరు సెషన్లుగా పరీక్షలు కొనసాగుతాయి. రోజుకు రెండు సెషన్లు (Two Sessions) ఉంటాయి. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్ష ఉంటుంది. 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లను మూసివేయడంతో కొందరు అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది.
………………………………….