
* ములుగు జిల్లాలో పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు
* ఎవరు పని చేసిన పార్టీ కోసమే ..
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా మంగపేట మండలం లో బీఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పర్యటించారు. మంగపేట మండలంలో కొత్తమల్లూర్ గ్రామంలో ఇటీవల వేడినీళ్లు పడి ఒళ్ళు కాలిపోయిన వర్షిత (12) ను, ఇటీవల కిడ్నీ ఆపరేషన్ అయిన మాటూరు నిర్మల ను పరామర్శించి రూ.5వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్బంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లో విభేదాలు ఉన్నాయని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు, ములుగు జిల్లాలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని విభేదాలు సృష్టించాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామానికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని వివరించాలన్నారు, కార్యక్రమంలో PACS చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్ ,జిల్లా నాయకులు యడ్లపల్లి నర్సింహా రావు, పీఏసీఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్ , కాకులమర్రి ప్రదీప్ రావు తాటికృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ,పార్టీ నాయకులు చిలకమర్రి రాజేందర్, చిట్టీమల్ల సమ్మయ్య, కర్రీ శ్యాంబాబు,, నూతిలకంటి ముకుందం, గాదె శ్రీనివాస్ చారి, పూజారి శ్రీనివాస్ , సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు,దంతానపల్లి నరేందర్, యలవర్తి శ్రీనివాస్, కర్రీ శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, రాజమల్ల సుకుమార్, గుండారాపు రమేష్, హుస్సేన్, రాజసాహెబ్, బడిశా నవీన్, రమేష్, కొమరం చంటి,, కుదురుపాక చిట్టిబాబు, తాడూరి రఘు , మండల యూత్ అధ్యక్షుడు గుమ్మలా వీరాస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు,ఎగ్గడి అర్జున్,రూప భద్రయ్య, మునిగెల సాంబులు,రొడ్డ సుదర్శన్,మహిళలు సరిత, కృష్ణవేణి, నాగ, సోషల్ మీడియా వారియర్స్ గుడివాడ శ్రీహరి, మునిగెల నరేష్, కర్రీ రామ్మోహన్, గందం కిషోర్ , కుమ్మరి చంద్రబాబు, జాడి భోజరావు, అంజన్ రావు, ఎండి ముస్తఫా, వావిలాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………….