
* జల్పల్లి నివాసం ముందు మనోజ్ బైఠాయింపు
* ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసుల మొహరింపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: నటుడు మోహన్బాబు కుటుంబం మరోమారు రోడ్డున పడిరది. సొంత గొడవలతో పోలీస్స్టేషన్ ఎక్కిన తనయులు తాజాగా మరో వివాదంతో ముందుకు వచ్చారు. తన కారు పోయిందని పేర్కొంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఇదంతా తన సోదరుడు విష్ణు చేయిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే జల్పల్లి నివాసం వద్దకు చేరుకున్న మనోజ్.. గేటు బయట భైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. తమది ఆస్తి గొడవ కాదన్నారు. తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. నాకు ఈ ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పాను. ఇది ఆస్తి గొడవ కాదు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా అన్నారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటివరకూ ఒక్క ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదని.. కత్తులు, గన్లతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారని.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు ఇచ్చానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే. కోర్టు నోటీసులతో వచ్చినా లోపలకు పంపించడం లేదని.. నా సమస్యను పరిష్కరించండని మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు-చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
…………………………