
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తుంది. డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
………………………….