
*జూలై 9 న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చెయ్యాలి
* సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం రాజేందర్
ఆకేరు న్యూస్ ములుగు ః .. కేంద్ర ప్రభుత్వం అవలంబింస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ జూలై 9 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం రాజేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కె సమ్మక్క అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం లో రాజేందర్ మాట్లాడుడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం 109 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్ లలో కనీస వేతనం, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి అని వివరించారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి , నాలుగో లేబర్ కోడ్ లను రద్దు చేయడమే లక్ష్యంగా కార్మిక వర్గ ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9 దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాస్ నర్సింగరావు, రుక్మిణి, సరిత, జమున, సుధా, రమాదేవి, నిర్మల , అరుణ, నాగమణి, బుజ్జి బాబు, ఆనంద్, భాగ్యలక్ష్మి, కవిత, రోజా రాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
………………………………………..