
* ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాతాళ్ళ రమేష్ మాదిగ
ఆకేరు న్యూస్ తాడ్వాయిః ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ చేసిన 30ఏళ్ల పోరాటం విజయం సాధించిందని దీనిని పురస్కరించుకొని జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా గ్రామగ్రామాన పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగురవేసి సంబరాలు నిర్వహించుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాతాళ్ళ రమేష్ మాదిగ పిలుపునిచ్చారు. తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో మాదిగ కులస్తులతో జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్ ఆద్వర్యంలో మండల ఇంఛార్జి గజ్జేల ప్రశాంత్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశం లో పలువురు నాయకులు మాట్లాడుతూ ” న్యాయం , ధర్మం మాదిగల పక్షాన ఉన్నది కనుకనే ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించిందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు సంక్రమించిన 9% రిజర్వేషన్లను ఉపయోగించుకొని విద్యా ఉద్యోగ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల ఎస్సీ వర్గీకరణ ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా మాదిగలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు..ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్గీకరణను ప్రతి శాఖ అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.ఇందులో అధ్యక్షులుగా లంజపల్లి సత్యం మాదిగ, ఉపాధ్యక్షులుగా పుల్లూరి రామస్వామి మాదిగ, ప్రధాన కార్యదర్శి గా పుల్లూరు చిరంజీవి మాదిగ, కార్యదర్శులుగా మడిపల్లి సురేష్ మాదిగ , దామెర స్వామి మాదిగ,గా ఆర్గనైజర్ మబ్బు సురేష్ మాదిగ , గౌరవ అధ్యక్షులు లంజపల్లి పెద్దబాబు మాదిగ, పుల్లూరి గౌరమ్మ మాదిగ మాజీ సర్పంచ్ మహిళ అధ్యక్షులు మడిపల్లి స్వప్న మాదిగ ప్రధాన కార్యదర్శి పుల్లూరి రాధా మాదిగ లను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్ MSP ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ MSP ములుగు జిల్లా అధికార ప్రతినిధి గజ్జేల ప్రసాద్ మాదిగ MEF లంజపల్లి రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.
……………………………………..