* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు; జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. గురువారం ములుగు జిల్లాలోని వేంకటపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామము లోని మారేడుగొండ చెరువులో జిల్లా కలెక్టర్ , డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ & స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాదు రఘు, జిల్లా మత్స్య శాఖ అధికారి టి.సల్మాన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాదు శంకర్ లతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-2026సంవత్సరానికి (478) సీజనల్ చెరువులు, (02) రిజర్వాయర్ లు , (08) పెరినియల్ చెరువులలో 1,57,55,224 లక్షలచేప పిల్లల విడుదల/పంపిణీ కొరకు అన్నిఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చేప పిల్లల పంపిణి ద్వారా చేపల ఉత్పతి దిగుబడులు పెరుగుతాయని,దినితో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు, దళారుల ప్రమేయం తగ్గడంతో మత్య్స కారులు స్వేచ్ఛగా అమ్ముకోవడం వలన గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారులకు తాజా చేపలు అందుబాటు ధరలకు దొరుకుతాయని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ పి.రమేష్, ఎఫ్.ఎ.ఎన్. మౌనిక, ప్రజా ప్రతినిధులు, మత్స్య కారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..
