* ఎక్కువ ఆదాయం, ఆస్తులున్న భార్యకు
* ఓ కేసులో తీర్పును వెల్లడించిన మద్రాస్ హైకోర్టు
ఆకేరు న్యూస్ డెస్క్ : భర్త కంటే అధికంగా ఆస్తులు, ఆదాయం కలిగి ఉన్న మహిళ భర్త నుంచి భరణం కోరజాలదని మద్రాసు హై కోర్టు స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని, చదువు ఖర్చులు ఇచ్చినా, ఇవ్వకపోయినా భార్యకు భర్త భరణం ఇవ్వాల్సిందేనని ఓ కేసులో ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. భర్త కంటే భార్యకు ఆస్తులు, ఆదాయం ఎక్కువగా ఉంటే భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన వైద్య దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. వారికి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ఒక కొడుకు ఉన్నాడు. వారి పిటిషన్పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు.. భర్త తన భార్యకు నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భర్త పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను పిటిషనర్ దాఖలు చేశారని పేర్కొంది. పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పుచెప్పింది. వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని, అతడి చదువుకయ్యే ఖర్చు రూ.2.77 లక్షలు భరించడానికి పిటిషనర్ అంగీకరించారని తెలిపింది.
…………………………………….
