
* సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
* టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోదీ సొంత రాజకీయం చేస్తున్నారని విమర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మంత్రులు, అధికారులు అందాల భామల చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అందాల పోటీల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీ(Modi)నే అని, కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు. దేశానికి ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా, మోదీ డీ ఆక్టివ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ డీయాక్టివ్ ప్రధానిగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. దేశానికి ప్రధానికి మోదీయా లేక ట్రంప్ అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. తల్లి దండ్రులు కష్టపడి మంచి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని, వారు అక్కడి నుంచి పంపించే డబ్బుపైనా 5 శాతం టాక్స్ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై అమెరికా పైశాచికానందం పొందుతుందని విమర్శించారు. అమెరికా (America) విధానాన్ని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోదీ సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోదీ మాత్రం ట్రంప్కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.
…………………………………………..