
* వరంగల్లో మొట్టమొదటి సారిగా చేసిన మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు
ఆకేరున్యూస్, వరంగల్: మెరుగైన చికిత్స కోసమంటూ మెట్రో నగరాలకు పరుగుపెట్టవలసిన అవసరం లేదిప్పుడు. మొట్టమొదటి సారిగా వరంగల్ పట్టణంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించటం ద్వారా మెడికవర్ హాస్పిటల్ వైద్యపరంగా నూతన ప్రమాణాలను నిర్దేశించింది. కార్డియాక్ సింకోపితో బాధపడుతున్న 77 సంవత్సరాల వయసు కలిగిన వరంగల్ నివాసికి అత్యంత క్లిష్టమైన తవి (TAVI) శస్త్రచికిత్సను విజయవంతంగా మెడికవర్ వైద్య బృందం చేసింది. అత్యంత క్లిష్టమైన గుండె చికిత్సలను చేయటంలో సుప్రసిద్దులైన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజస్ట్ డాక్టర్ ఏ శరత్ రెడ్డి (SHARATH REDDY) నేతృత్వంలో మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, సిటివిఎస్, డాక్టర్ సృజన్ అల్లాడి మరియు అనస్థీషియా, డాక్టర్ అవనీష్ ఎస్ బృందం ఈ చికిత్సలో పాలు పంచుకుంది. ఈ చికిత్స యొక్క క్లిష్టతను మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజస్ట్ , క్యాత్ ల్యాబ్ , సిటిఓ అండ్ కాంప్లెక్స్ కరొనరీ ఇంటర్వెన్షన్స్ డైరెక్టర్ డాక్టర్ ఏ శరత్రెడ్డి మాట్లాడుతూ ‘‘ ఈ రోగి అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సింకోపితో బాధ పడుతున్నారని.. ఆయన గుండెలయ సక్రమంగా లేకపోవటంతో పాటుగా ఆయన గుండె యొక్క రక్తనాళాలు పూడుకుపోవటం, హార్ట్ వాల్వ్లో అవరోధాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు.
ఈ తరహా సమస్యలు కలిగిన వారికి వాల్వ్స్ వేయటంతో పాటుగా బైపాస్ కూడా చేయాల్సి ఉంటుందని.. అయితే అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా తవి మరియు పిటిసిఏలను ఒకేసారి చేశామన్నారు. ఈ తరహా చికిత్సలకు నైపుణ్యం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని.. వరంగల్లో తొలిసారి విజయవంతంగా ఈ శస్త్రచికిత్స చేయటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ (SRAVAN KUMAR) మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సింకోపి ఎటాక్తో రోగి సతమతమవుతున్నారన్నారు. పలు హాస్పిటల్లో ఆయన చూపించుకుని చివరగా మెడికవర్కు ఆయన వచ్చారని తెలిపారు. రోగి యొక్క స్థితి చూసి తొలుత 2డి ఎకో చేసామని.. అందులో సివియర్ అయోర్టిక్ స్టెనోసిస్ అని తేలింలని తెలిపారు. అనంతరం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత రోగికి గుండె రక్త నాళాలు, ఇతర సమస్యలు బయటపడ్డాయని.. అతనికి సిటీ అంజియోగ్రామ్ను తవి ప్రోటోకాల్తో చేయడం జరిగిందని వివరించారు. ఈ మినిమల్ ఇన్వాసివ్ ప్రొసీజర్ వల్ల రోగి త్వరగా కోలుకున్నారని.. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండగా డిశ్చార్జ్ చేసామన్నారు. తదుపరి మూడు ఫాలో అప్లలో రోగికి ఎలాంటి సమస్యలూ రాలేదని.. మొట్టమొదటిసారిగా వరంగల్లో పిటి సిఏ అండ్ తావి ప్రొసీజర్ ఒకటేసారి మెడికవర్ హాస్పిటల్లో చేయడం జరిగిందన్నారు.
…………………………………………………………..