
* వ్యాపారాలను కాపాడుకునేందుకు ఏ పార్టీదైనా కొమ్ము కాసేతత్వం మజ్లిస్ది
* ఆర్ఎస్ఎస్ ఏనాడూ ఉగ్రవాదులను పోషించలేదు
* దారుస్సలాం టెర్రరిస్టులకు అడ్డాగా మారింది
* కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరున్యూస్, కరీంనగర్: కరీంనగర్లోని తన నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజబందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది మన తెలుగు ప్రజల వారసత్వ పండుగ, విశ్వావసు నామ సంవత్సరంలో ప్రపంచ ప్రజలందరికీ శు బాబు కరిగించాలని కోరుకుంటున్న, ఈ సంవత్సరం ప్రజలందరికీ సమృద్ధిగా ఆదాయం పెరగాలని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోంది. మోదీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువైతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమేనన్పిస్తోంది.ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోంది కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకింది.కాంట్రాక్టుల దగ్గర నుండి పెండిరగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదు. కాంగ్రెస్ కరషన్ వైరస్’ మూలంగా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పింక్ వైరస్’పోయి తెలంగాణ వైరస్ పీడ విరిగింది. కాంగ్రెస్ కరప్షన్ వైరస్’ వారినుండి బీజేపీ ప్రజలను కాపాడుకుంటాం. పోరాటాలనే వ్యాక్సిన్గా కాంగ్రెస్ అవినీతిపై యుద్ధం చేయబోతున్నాం. సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నాం. బియ్యం ఖర్చంగా కేంద్రమే భరిస్తోంది. ఒక్కో కిలోకు రూ.40లు మోడీ సర్కారే చెల్లిస్తోంది. సన్న బియ్యంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం రూ.10 మాత్రమే. రాష్ట్ర సర్కార్ వేసే ఖర్చు కంటే మూడు రెట్లు అదనంగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వెంటనే రేషన్ షాపులతో పాటు అంతటా ప్రధాని ఫోటోలు కూడా పెట్టాల్సిందే, ఫోన్ బ్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగారుస్తున్నారు. శ్రవణ్ రావునహా అందరికీ బెయిల్ వచ్చేలా చేసి కాంగ్రెస్సే సహకరిస్తోంది. గత ఎలక్షన్ ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడుతోంది. అందుకే ఏడాదిన్నరైనా అరెస్ట్ కాదు కదా. కనీసం నోటీసులిచ్చి విచారణ కూడా వేయండం లేదు. ప్రజలను దారి మళ్లించడానికి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నాయి. దేశాన్ని విభజిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ఆవారులు పేలుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలూ మూడు కుమ్మకైనయ్, జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీరి దూరంగా ఉంటూ మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్ధమైనయ్.మరి కొద్దిరోజుల్లో పార్టీల అసలు రంగు కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదు? జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం ముగ్లీష్ గెలిపించేందకు కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోంది. వక్స్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. అతి త్వరలోనే వక్స్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం పొందడం తథ్యం. ఆర్ఎస్ఎస్ దేశభక్తి కలిగిన పార్టీ… ఈ దేశ ధర్మం సదాతన ధర్మం, హిందూ సమాజ సంఘటితం చేసేందుకు నిరంతరం కుషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
……………………………………………………………