
ఆకేరున్యూస్, తిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందగా, చాలామంది గాయపడ్డ విషయం తెలిసిందే.,, కాగా.. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. ఆ తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మెన్ ఆదేశాల ప్రకారం.. తొక్కిసలాటలో గాయపడ్డవారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం కల్పించగా.. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు.
………………………………………….