ఆకేరు న్యూస్, డెస్క్: దీపావళి పండుగకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు జరుపుకునే దీపావళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8న ప్రారంభమైన సమావేశాలు 13 వరకు జరగనున్నాయి. భారత్కు చెందిన 15 అంశాలకు యునెస్కో ఇప్పటికే వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో ఇంతకు ముందు కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామలీల మొదలైనవి ఉన్నాయి. హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. ఈ పండుగను యునెస్కో జాబితాలో చేర్చడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండుగకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో భారతీయుల్లో సంబురాలు నెలకొన్నాయి. భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
