
ఆకేరున్యూస్ డెస్క్: అపరిచితుడు సినిమాలో అదరగొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తమిళ హీరో విక్రం రాజమౌళి సినిమాలో నటించడానికి నో చెప్పాడట.. ఒక్కసారైనా రాజమౌళి సినిమాల్లో నటిస్తే చాలు అనుకునే అగ్రహీరోలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే బాహుబలి సినిమాతో రాజమౌళి గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగింది. పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు.. బాహుబలిలో నటించినందుకే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.. మరి అలాంటిది విక్రమ్ ఎందుకు రాజమౌళి సినిమాలో నటించడానికి తిరస్కరించాడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్బాబు కాంబినేషన్లో ఎస్ఎస్బీ 29 చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులుఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ రోల్ వేయడానికి రాజమౌళి విక్రమ్ ను సంప్రదించారట.. కానీ విలన్ రోల్ అని విలన్ సున్నితంగా తిరస్కరించారట..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కమల్ హాసన్ , పహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి జూనియర్ ఎన్టీఆర్ ,సూర్య లాంటి అగ్ర హీరోలు ఓ వైపు విలన్ పాత్రలను అంగీకరిస్తుండగా విక్రం ఇప్పుడిప్పుడే విలన్ పాత్రలు పోషించడం ఇష్టం లేదని అన్నాడట.. అంటే ఇంకా విక్రమ్ అప్ డేట్ కాలేదని సినీ ప్రియులు అంటున్నారు విలన్ పాత్రల్లో నటనకు కావాల్సినంత స్పేస్ ఉంటుందని విక్రమ్ కి తెలియదా అనుకుంటున్నారు.
…………………………………….