* ప్రధాన నిందితుడితో పాటు నలుగురు సభ్యుల అరెస్టు
ఆకేరు న్యూస్, వరంగల్ : ఏసీబీ అధికారల మంటూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న ముఠా లోని ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ పోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు పదమూడు 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు, వయస్సు 45 సం.లు, వేలమద్ది గ్రామం, నల్లమాడ మండలం, సత్యసాయి పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2. నవీన్ JR, హరోహళీ తాలుకా, రాంనగర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, 3. మంగళ రవీందర్, యశ్వంతపూర్, బెంగుళూర్, కర్ణాటక, 4, మురళి, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం, 5. N. ప్రసన్న, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించగా, ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో వున్నారు.
ఈ అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులతో పాటు పదవీవిరమణకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోని వారికి ఏసిబి డి. ఎస్పీనంటూ ఫోన్ చేసి “మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి వుంటుంది” అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఎసిబి డీ. ఎస్పీ నంటూ బెదిరించి సుమారు 10 లక్షల రూపాయలను వివిధ మార్గాల్లో దోచేయడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ను మరియు అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విదారణ చేపట్టారు.ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరితో దొంగతనాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆ తరువాత నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుండి బంగారం, డబ్బు దోపిడికి పాల్పడటంతో సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలు తరలించారు. జైలులో నిందితుడు తన వ్యవహార శైలిని మార్చుకోకుండా జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు మరియు రాయలసీమ ప్రాంతాల్లో 41 కి పైగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడటం తో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు.నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఎసిబి డి.ఎస్సీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదు అయి సుమారు రూ. 50 లక్షలకు పైగా దోపిడీకి పాల్పడగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్ అలాగే గతంలో కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల మరియు వనపర్తి లతో పాటు ఆంధ్రలోని కర్నూల్ జిల్లాలో జరిగిన 02 నేరాలలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ దేచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో వున్న మిగితా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్ మరియు గోవాలో కాసినో లలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసులు విచారణలో నిందితుడు అంగీకరించాడు.ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి డి.కవిత గారిని, వరంగల్ ఎసిపి ఎన్. శుబం ప్రకాష్ ఐపిఎస్, టాస్క్చోర్స్ ఎసిపి ఏ. మదుసూదన్ మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీదర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్ మరియు ఎస్.ఐ లు ఎస్. మహేష్, ఎం. సురేష్ లను మరియు టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు.
……………………………………………
