
* ఈ ప్రాంతానికి చుక్క నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్
* గోదావరిజలాలతో ములుగును సస్యశ్యామలం చేస్తా
* రైతును రాజుగా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల గోదావరిజలాలను సిద్దిపేట సిరిసిల్లకు తరలించుకుపోయారని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలను జంగాలపల్లి బంజరు చెరువుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం మూలంగా ములుగు నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వకుండా సిద్దిపేట సిరిసిల్లకు నీళ్లను తరలించుకుపోయారని అన్నారు. రాబోయే రోజుల్లో ములుగు పంపు హౌస్ నుండి కొత్త గూడ, గంగారాం మండలాలకు గోదావరి జలాలు అందించి రైతాంగాన్ని ఆదుకుంటామని, రెండు పంటలకు నీళ్లను అందిస్తామని అన్నారు.
త్వరలోనే పంపు హౌస్ నుండి కాశిం దేవిపేట మీదిగా కేనాయిల్ ద్వారా లక్నవరంకు నీళ్లను పంపింగ్ చేసుకోవడం జరుగుతుందని, గోదావరి జలాల ద్వారా ములుగు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనన్నారు. రైతును రాజుగా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాణోత్ రవి చందర్ తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు బోధనలు భావితరాలకు అందించాలి…
ఏసు క్రీస్తు బోధనలు బావితరాలకు అందించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోనీ ఓలి మిని స్ట్రీట్ చర్చి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలైన స్వార్థ రహిత జీవనం, ప్రేమా, దయ, ఎదుటి వారిని క్షమించే గుణం, తమకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం, శాంతి సౌభ్రాతృత్వన్నిపంచే క్రీస్తు బోధనలు యధాతధంగా ఎంత గొప్పగా ప్రచారంలోకి వస్తే ఈ ప్రపంచానికి అంత గొప్ప మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
……………………………………………..