
* ఉగ్రవాదంపై పోరులో జోక్యం చేసుకున్నందుకే బుద్ధి చెప్పాం
* పహల్గామ్ పాపానికి మూల్యం చెల్లించుకున్నారు
* మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలిచింది
* సంపూర్ణ సమన్వయంతో పాక్ దాడులను తిప్పికొట్టాం
* ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారే టార్గెట్ గా ఆపరేషన్ సిందూర్
* మీడియా సమావేశంలో త్రివిధ దళాధిపతులు
ఆకేరు న్యూస్, డెస్క్ :
ఆపరేషన్ సిందూర్ పై త్రివిధ దళాల సేనాధిపతులు కీలక సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. మా యుద్ధం పాకిస్తాన్ సేనతో కాదని, పాకిస్తాన్ సేన ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారే టార్గెట్ గా ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. కశ్మీర్, పీఓకే లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. పీఓకే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశామన్నారు. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అన్నారు. పాకిస్తాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టమూ చేయలేదన్నారు. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం కలగకుండా కాపాడుకోగలిగామన్నారు. అత్యాధునిక క్షిఫణి రక్షక వ్యవస్థతో పాక్ క్షిపణులను, డ్రోన్లను తిప్పికొట్టామన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలిచిందని, అత్యాధునిక ఆయుధాలతో పాక్ విరుచుకుపడ్డామని తెలిపారు. పహల్గామ్ పాపానికి మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. బహుళ ఆయుధ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్ కు లేదని లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ గాయ్ తెలిపారు. త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయంతో ఉందని డీజీ నావల్ ఆపరేషన్ ఏఎన్ ప్రమోద్ తెలిపారు. భారత్ పై పాక్ దాడులను నిలువరించామన్నారు. నౌకాదళం పరంగా కూడా పూర్తి సన్నద్ధత ఉందన్నారు. ఎగిరేవేంటో నిశితంగా గమనించే సామర్థ్యం ఉందని తెలిపారు. పైటర్లు, నిఘా, విమానం కాపలా కాస్తున్నాయని అన్నారు. రాత్రి, పగలు కూడా పని చేయగల సామర్థ్యం మన పైలెట్లకు ఉందని తెలిపారు.
………………………………..