
* తెలంగాణ ఇస్తే పదేళ్లు దోపిడీ చేశావ్
* మళ్ల్లీ మమ్ములనే విలన్ అంటావా
* ఏం చేస్తున్నామో.. చేస్తలేమో సభకు వస్తే కదా తెలిసేది
* కేసీిఆర్ విమర్శలను తిప్పికొట్టిన సీఎం రేవంత్
ఆకేరున్యూస్, హైదరాబాద్: భారాస రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ఇలా ఎప్పుడూ చేయలేదన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇటీవల భారాస రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం దీటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ చెబుతున్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని మండిపడ్డారు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు- చేసుకున్నామని అలాగే, ప్రజల అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచేలా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నట్లు- ఆయన తెలిపారు. శాసన సభలో సభ నాయకుడిగా నేను, మంత్రులం అంతా పాల్గొన్నామని తెలిపారు. అయితే, నిన్నగాక మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టిండని, అయితే మాకేం అభ్యంతరం లేదన్నారు. ఇక సభకు ఎన్ని వందల బస్సులు అడిగితే అన్ని ఇవ్వండి అని మంత్రి పొన్నంకి చెప్పానని, అధికార పక్షమే కాదు.. ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలని అందుకు సహకరించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. అయితే, సభలో ప్రజల సమస్యలు ఏదైనా ప్రస్తావించారా..? మా లోపాలు చెప్పినవా..? మంచిని అభినందించావా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటున్నారు.. ఏ చట్టంలో ఉన్నది, జీతాలు తీసుకుని పని చేయడం అని అంటూనే.. అన్ని వసతులు అనుభవిస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. మేము ఇచ్చినవి అగినయి అంటున్నావు.. ఏమి అగినయని సీఎం ప్రశ్నించారు .విూరు సభకు రారు… కాబట్టి మేం ఏం చేస్తున్నామో ఎట్లా తెలుస్తుంది? విూరు ఏ మత్తులో జోగుతున్నారో తెలియదు.. విద్వేష పూరిత ప్రసంగం చేసి.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారాని సీఎం రేవంత్ ఆగ్రహించారు. పదేళ్లు మేమే అధికారంలో ఉంటాము.. అదే పదేళ్లు ఫార్మ్ హౌస్లోనే ఉంటావు.. తర్వాత నీ చరిత్ర ఫార్మ్ హౌస్లోనే పరిసమాప్తం అంటూ ఎద్దేవా చేసారు. విూ కుటుంబం పదేళ్లు దోచుకోలేదా..? దేని విూద చర్చ చేద్దామో చెప్పు, సభ పెడదాంరా.. ప్రతిపక్ష నాయకుడిగా నిర్ణయాల్లో తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటామని సీఎం మాట్లాడారు. అలాగే విషం చిమ్మే మాటలు వద్దు, ఆయన మాటల్లో, కండ్లల్లో విషం.. విచక్షణ ఉండాలి కదా… ఏం మాట్లాడుతున్నామో అని అన్నారు. మేము తెలంగాణ ఇస్తే.. పదేళ్లు దోచుకుని మమల్ని విలన్ అంటున్నావని ఫైర్ అయ్యారు. ప్రజలు అనాలి.. విూరు తెలంగాణ ఇస్తే… ఆయన ఆగం చేశారని మమ్మల్ని అనాలి, నువ్వు కాదని సీఎం అన్నారు.
…………………………………………………….